Posts

కృతజ్ఞతయొక్క మహత్తర శక్తి

Image
కృతజ్ఞతయొక్క మహత్తర శక్తి ఒక ఎడారిలో ఒక పక్షి ఉండేది. అది చాలా అనారోగ్యంతో, ఈకలు లేకుండా, తినడానికి తిండి, తాగడానికి నీరు మరియు ఉండటానికి గూడు లేక ఎప్పుడూ రాత్రింబవళ్లు తన జీవితాన్ని శపించుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక దేవదూత ఆ ఎడారి మీదుగా వెళ్తుండగా, ఆ పక్షి దేవదూతను ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. దానికి దేవదూత, "నేను భగవంతుడిని కలవడానికి వెళ్తున్నాను" అని బదులిచ్చింది. అప్పుడు ఆ పక్షి, "దయచేసి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో భగవంతుడిని అడిగి చెబుతారా?" అని వేడుకుంది. దేవదూత "తప్పకుండా అడుగుతాను" అని చెప్పి పక్షికి వీడ్కోలు పలికి వెళ్లిపోయింది. దేవదూత భగవంతుడి సన్నిధికి చేరుకుని, పక్షి చెప్పిన విషయాన్ని ఆయనతో పంచుకుంది. పక్షి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించి, దాని బాధలు ఎప్పుడు ముగుస్తాయని దేవుడిని అడిగింది. దానికి భగవంతుడు, "రాబోయే ఏడు జన్మల వరకు ఆ పక్షి ఇలాగే కష్టాలు అనుభవించాలి, అంతవరకు దానికి ఎలాంటి సంతోషం ఉండదు" అని బదులిచ్చారు. దేవదూత, "పక్షి ఈ విషయం వింటే చాలా నిరుత్సాహపడుతుంది, దీనికి ఏదైనా పరిష్కారం స...

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు

Image
కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు 🏵️ 1. అజీర్ణే భోజనమ్ విషమ్. మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం విషం తీసుకోవడంతో సమానం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి సంకేతం. ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు. 🏵️ 2. అర్ధరోగహరి నిద్రా సరైన నిద్ర వ్యాధులలో సగం నయం చేస్తుంది. ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. 🏵️ 3. ముద్గధాలి గధవ్యాలి అన్ని పప్పుధాన్యాలలో పచ్చ పెసలు ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 🏵️ 4. బాగ్నస్తి సంధనకరో రాసోనాహా వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు గట్టిగా ఉంటాయి. 🏵️ 5. అతి సర్వత్రా వర్జయేత్ ఏదైనా అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా తినండి. 🏵️ 6. నాస్తిమూలం అనౌషాధం శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 🏵️ 7. నా వైద్యా ప్రభుయుయుషా ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. 🏵️ 8. చింతా వ్యాధి ప్రకాషయ చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. 🏵️ 9. వ్యాయమాశ్చ సనైహి సనైహి వ్యాయామం నెమ్మదిగా...

సమస్య - భయం

Image
సమస్య - భయం ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టువున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది... ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు... కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పర...

అహల్యా బాయి హోల్కర్ - ఇండోర్ మహారాణి

Image
అహల్యా బాయి హోల్కర్ - ఇండోర్ మహారాణి మాన్య మహారాణి శ్రీమంతురాలు అఖండ సౌభాగ్యవతి అహల్యాబాయి సాహిబా, 1725వ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగింది.1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు (భర్త) మృతిచెందాడు.. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్(మామగారు) అడ్డుకున్నాడు. ఆయన అహల్యా బాయికి యుధ్ధవిద్యలలో, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్(మామగారు) , 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు. పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. *దేవి అహల్యా బాయి హోల్కర్ - మన దేశంలో నిర్మించిన - మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునఃరుద్ధినిచిన కొన్ని దేవాలయములు* 1. అలంపూర్ (ఎంపీ) - హరిహరేశ్వర్, బతుక్, మల్హరిమార్తాండ్, సూర్య, రేణుక, రామ్ హనుమాన్ ద...

ధనమా - దైవమా ?

Image
ధనమా - దైవమా ? ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు. “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..” భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స...

నిజమైన పాఠం

Image
నిజమైన పాఠం ఒక రష్యా ప్రొఫెసర్ భారతీయ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి బెనారస్ హిందూ యూనివర్సిటీకి వచ్చాడు. తన సందర్శనలో, అతను పూర్తిగా ఆశ్చర్యపోయేలా చేసిన ఒక అనుభవం ఎదురైంది. భారత్లో, పరీక్షలో అత్యధిక మార్కులు 5. కానీ అతన్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే: ఒక ఖాళీ సమాధాన పత్రానికి కూడా 2 మార్కులు ఇవ్వబడ్డాయి. ప్రొఫెసర్ అది నమ్మలేకపోయాడు. ఏమీ రాయని విద్యార్థి సున్న మార్కులకు అర్హుడు కానీ రెండు మార్కుల ఎలావేశారు అనుకున్నాడు? ఆ ప్రశ్న అతని మనస్సులో ఉండిపోయింది, చివరికి అతను ఒక సీనియర్ భారతీయ అధ్యాపకుడిని అడిగాడు. "ఏమీ రాయకుండా ఉన్న వాడికి మార్కులు ఎలా ఇవ్వగలరు?" అధ్యాపకుడు నవ్వాడు. తరువాత భారతీయ ప్రొఫెసర్ ఎప్పటికీ మరచిపోలేని సమాధానం చెప్పాడు. "సున్నా అంటే అస్తిత్వం లేకపోవడం. ఒక విద్యార్థి నా ముందు నిలబడి ఉంటే, నేను అతన్ని లేడు అని ఎలా అనుకోగలను?" ప్రొఫెసర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అధ్యాపకుడు కొనసాగించాడు. "బహుశా ఆ విద్యార్ధి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉండొచ్చు,." "అతను మంచు మరియు చలి వాతావరణంలో ప్రయాణించి వచ్చి ఉండవచ్చు." "బహు...

తులసీ దళం

Image
తులసీ దళం *ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.* *అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు.* *కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.* *అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నదని.* *ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను.పూజ నేను చేయలేను,అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు.* *ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు.* *అతడితో నాయనా నేను చెప్పేవరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెను...