మరిన్ని కథలకోసం *www.grandhalayam.in* ని క్లిక్ చెయ్యండి [కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల] ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఒక అమ్మాయి,ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. “చదువులేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. ‘నేను నీవాడిని, నీవు నావాడివి!” అని దేవుడికి చెప్పుకొనే వాడు. అందరూ అతని మాటలకు నవ్వుకొనేవారు. అతను పట్టించుకొనేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా “నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు” అనేవాడు. కూతురికి పెళ్ళి చేయడానికి డబ్బు అవసరం అయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని, పెళ్ళి చేసి, రెండు సంవత్సరాలు కష్టపడి, డబ్బు కూడబెట్టి,అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడు అని తెలిసిన వ్యాపారి, అప్పు తీరిపోయిందని చూపే పత్రం తన దగ్గరే పెట్టుకొని, ఇంకా ఇన్ని రూపాయల అప్పు వుంది అని చెప్పే ఒక నకిలీ పత్రాన్ని తయారుచేసి దాన్ని ఇతనికి ఇచ్చిపంపాడు. నెల రోజుల తరువాత అప్పు తీర్చడంలేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేసాడు ...