ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు . . అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు. అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు . దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది . ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు . . ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది . ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది . ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది . మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు . . సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది . . ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ అడిగింది . . కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని . “నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు . అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు . అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు . . “ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” . . “ దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!” . . ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ? . ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు . . మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు . . జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు . . ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం ! . ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం !
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...