మరిన్ని కథలకోసం *www.grandhalayam.in* ని క్లిక్ చెయ్యండి
*Superb story writen by Chetan Bhagat in his FB Post*
ఒక రాత్రి, షాపు యజమాని దుకాణం మూసివేయబోతుండగా, ఒక కుక్క లోపలికి వచ్చింది. దాని నోట్లో ఒక సంచి ఉంది. ఆ సంచిలో కొనవలసిన వస్తువుల జాబితా (లిస్ట్) మరియు డబ్బులు ఉన్నాయి. షాపు యజమాని ఆ డబ్బులు తీసుకొని, వస్తువులను సంచిలో పెట్టాడు.
వెంటనే ఆ కుక్క వస్తువుల సంచిని నోటితో పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. షాపు యజమాని చాలా ఆశ్చర్యపోయి, దాని యజమాని ఎవరో తెలుసుకోవాలని ఆ కుక్క వెనుక వెళ్లాడు.
ఆ కుక్క బస్టాండ్ దగ్గర బస్సు కోసం వేచి చూసింది. కొంత సమయం తర్వాత బస్సు రాగానే, కుక్క బస్సు ఎక్కింది. కండక్టర్ రాగానే, అది ముందుకు జరిగి తన మెడ పట్టీని చూపించింది. ఆ పట్టీలో డబ్బులు, ఇంటి అడ్రస్ ఉన్నాయి. కండక్టర్ డబ్బులు తీసుకుని, టిక్కెట్ను తిరిగి దాని మెడ పట్టీలోనే పెట్టాడు.
బస్సు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, ఆ కుక్క ముందుకు వెళ్లి, తాను దిగాలనే సంకేతంగా తోక ఊపింది. బస్సు ఆగగానే అది కిందకు దిగింది. షాపు యజమాని ఇంకా దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు.
ఇంటికి చేరుకున్న కుక్క తన కాళ్లతో తలుపు తట్టింది. లోపలి నుండి వచ్చిన దాని యజమాని, ఒక కర్ర తీసుకుని ఆ కుక్కను కొట్టడం ప్రారంభించాడు.
అది చూసి షాక్కు గురైన షాపు యజమాని, "ఇంత తెలివైన కుక్కను ఎందుకు కొడుతున్నావు?" అని అడిగాడు. దానికి ఆ యజమాని, "ఇది నా నిద్రను పాడు చేసింది. వెళ్లేటప్పుడు తనతో పాటు ఇంటి తాళాలు కూడా తీసుకెళ్లవచ్చు కదా!" అని సమాధానమిచ్చాడు.
కథలోని నీతి:
ఇదే జీవిత సత్యం. మీ నుండి ప్రజలకు ఉండే అంచనాలకు అంతం అంటూ ఉండదు. మీరు ఒక్క చిన్న తప్పు చేసిన మరుక్షణమే, వారు మీ తప్పులను వేలెత్తి చూపించడం మొదలుపెడతారు. గతంలో మీరు చేసిన మంచి మొత్తాన్ని పూర్తిగా మర్చిపోతారు. అప్పుడు మీరు చేసిన చిన్న పొరపాటు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ లౌకిక ప్రపంచం యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది...!!!
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
మరిన్ని కథలకోసం *www.grandhalayam.in* ని క్లిక్ చెయ్యండి అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చ...
Comments
Post a Comment