ఇది నిజంగా రోమాలు
నిక్క పొడుచుకొనేలా చేసే
నిజ జీవితంలో
జరిగిన సంఘటన...
చరిత్రలో నిలిచిన కథ.
నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు,
ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది.
ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని,
అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని
ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు.
ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కి
పరమ శివుడు కనిపించాడు.
నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది.
ఈయనది ఈయన భార్యది నిజంగా అదృష్టమే.
1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,
“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్
అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.
ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .
కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు.
ఆమె పేరు మేరీ.
ఇలా కొన్ని రోజులు గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది.
అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనికి గురి అయింది.
ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది.
ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది.
అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది.
అక్కడ పూజారులు
మహా శివుణ్ణి పూజించడం ఆమె గమనించింది.
ఆ పూజారులు
“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని”
గ్రహించి పలకరించారు.
ఆ పూజారులు
“ఏమైంది తల్లి నీకు అని అడగగానే,
వెంటనే ఆమె భర్త
‘కల్నల్ గురించి చెప్పి,
భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని,
వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ పూజారులు ఆమెని ఓదారుస్తూ
“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.
ఆమె గుడిలో
మహా శివునికి మొక్కి ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ
“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది.
భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.
11 రోజుల జపం చేసిన తర్వాత,
ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.
ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు.
పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని,
ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని.
అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ
ఒక భారతదేశపు
మహా యోగి వెలుగుతూ కనిపించాడని.
ఆయన పులి చర్మం ధరించి,
మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని,
ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు.
ఆయన శక్తికి,
తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు.
ఆయోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు.
ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని,
ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ,
నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.
కొన్ని వారాల తర్వాత,
కల్నల్ ఇంటికి చేరుకున్నారు.
తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు.
కల్నల్ గుడిలో ఉన్న
మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు.
అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ
“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు.
ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు.
జన్మ ధన్యం చేసుకున్నారు.
ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి.
బ్రిటిష్ వాళ్ళు కట్టిన
ఒకే ఒక్క గుడి ఇదే.
ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...
👍👏👌
💐 ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు. 💐 ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. 💐 ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్’’ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 💐 ఈ సంఘటన జరిగిన మూడు రోజుల త...
*ఒక అద్భుతమైన కథ*. రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కా...