Posts

Image

భోజన టీచర్

Image
మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కుకున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు. అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు.రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది. చాలా కార్లు నిలిచి వున్నాయి.అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు. 30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రామ ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు.రెండుకూరలు,రెండు పచ్చళ్ళు,పప్పు,పులుసు అన్నీ ఉండేవి. మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. హాయిగా తినండి.నిదానంగా తినండి తొందరేమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు. ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే. బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మ...

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

Image
యజ్ఞోపవీతం (జంధ్యాన్ని) మార్చుకోవటానికి అవసరమైన ప్రధాన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది: ముఖ్యంగా అవసరమైనవి: యజ్ఞోపవీతం (Jandhyam/Sacred Thread) – కొత్తది పసుపు (Turmeric powder) కుంకుమ (Kumkum) సామిద్దులు (Samidhalu – Havan wood sticks) బేటలు (Betel nuts) టమాలపాకులు (Betel leaves) ఆచమనం చేయటానికి నీళ్ళు (Water in a small vessel) దీపం లేదా కర్పూరం (Oil lamp or camphor) గంధం, అగరబత్తి (Sandal powder, incense sticks) ఫలాలు లేదా డ్రైఫ్రూట్స్ (Fruits or dry fruits) బెల్లమ్, శర్కరలు (Jaggery, sugar) పంచపాత్రలు/పాత్రలు-2 (Vessels/plates for pooja) ఈ వస్తువులు సంప్రదాయం ప్రకారం ప్రాంతాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి తేడా ఉంటుంది. కానీ కొత్త యజ్ఞోపవీతం (జంధ్యం), దర్భలు, చిన్న పూజా వస్తువులు, మరియు నమ్మకమైనది ముఖ్యంగా కావాల్సింది. దీపారాధన చేసిన పిమ్మట ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవ...

ప్రవర్తన

Image
ఒకసారి గురూజీ తన ప్రవచనం మధ్యలో 30 ఏళ్ల యువకుడిని లేవమని అడిగారు. గురూజీ అడిగారు – “నువ్వు ముంబైలోని జూహూ చౌపట్టి బీచ్‌లో నడుస్తూ ఉండగా, ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తే నువ్వు ఏమి చేస్తావు?” యువకుడు చెప్పాడు – “ఆమెను చూస్తాను, ఆమె వ్యక్తిత్వాన్ని గమనిస్తాను.” గురూజీ మళ్లీ అడిగారు – “ఆ అమ్మాయి ముందుకు వెళ్లిపోయిన తర్వాత నువ్వు వెనక్కి చూసేవాడివా?” యువకుడు నవ్వుతూ చెప్పాడు – “అవును, కానీ నా భార్య తోడులో లేనప్పుడు మాత్రమే.” (అందరూ నవ్వారు) గురూజీ మళ్లీ ప్రశ్నించారు – “ఆ అందమైన ముఖాన్ని నువ్వు ఎంతసేపు గుర్తు పెట్టుకుంటావు?” యువకుడు చెప్పాడు – “బహుశా 5-10 నిమిషాలు మాత్రమే, అంతవరకే... తరువాత ఇంకో అందమైన ముఖం కనపడే వరకు.” గురూజీ ఆ యువకుడితో ఇలా అన్నారు – “ఇప్పుడు ఊహించు… నువ్వు జైపూర్ నుండి ముంబై వెళ్తున్నావు. నేను నీకు ఒక పుస్తకాల సంచి ఇచ్చి, అది ముంబైలోని ఒక మహానుభావుని ఇంటికి అందించమని చెప్పాను. నువ్వు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అందిస్తే, ఆయన ఒక బిలియనీర్ అని తెలుస్తుంది. ఆయన బంగ్లా గేటు వద్ద 10 కార్లు పార్క్ చేసి ఉంటాయి, 5 మంది గార్డులు ఉంటారు. నీ గురించి సమాచారం వెళ్లగా...

భగవంతునిపై నమ్మకం

Image
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏 “సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు." ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది. తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు. అప్పుడా వ్యక్తి ‘నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది ?’ అని బాధపడ్డాడు ఆ తర్వాత ‘తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని’ మనసులో భగవంతుని గట్టిగా విశ్వసించాడు. ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ భగవంతుని పట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక...

తెలుగు పద్యరత్నాలు

Image
ఆనందంబున నర్థరాత్రములఁ జంద్రాలోకముల్ కాయగా   నానా సైకత వేదికాస్థలములన్ నల్దిక్కులన్ శంభుఁ గా   శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు   న్మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటి లోన్.   ఆ మందాకిని యా త్రివేణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం  బామధ్యాంతర కక్ష్యలా విమల దివ్యజ్యోతి రుజ్జృంభణ   శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపఁ గాశిమహా  గ్రామంబిప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముం గైకొనువ్.   కలడందురు దీనులయెడ,   కలడందురు  భక్తియోగి గణముల పాలం,   కలడందురన్ని దిశలను,   కలడు కలండనెడివాడు కలడో లేడో   ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై  యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం  బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా  డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌   "లా వొక్కింతయు లేదు ధైర్యమువిలోలంబయ్యెబ్రాణంబులున్  ఠావుల్ దప్పెనుమూర్ఛవచ్ఛెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్  నీవే తప్ప నితఃపరం ...

నైమిశారణ్యం

Image
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను. ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరో...

పిల్లల విదేశీయానం - తల్లిదండ్రుల కష్టాలు

Image
కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు. జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని. ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి. ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క. ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి. మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై ల...