తండ్రి చనిపోయిన తరువాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చెర్పించాడు.వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధశ్రమానికి నెల నెల కట్టేవాడు.ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు.అలా కొన్ని ఏళ్ళు గడిచాయి, ఒక రోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగోలేదు చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది. మీరు వెంటనే రండి అని. తల్లి తన శక్తినంత కూడ ధీసుకొని బాబు! నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది?తల్లి చేతిలో చేయ్యేసి చెప్పమ్మ ....అన్నాడు కొడుకు. నాయనా ! ఈ ఆశ్రమములో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు, ఆహారం పాడవకుండా ఫ్రిజ్ కూడా కొను కొన్ని రోజులు నేను తినకుండా పడుకున్నాను,అన్నది తల్లి,
"అమ్మ! ఇన్ని రోజుల నుండి ఇక్కడ వున్నావు కదా నేను చాల సార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా ఎప్పుడు చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెపుతున్నావు అని అడిగిండుు, బాబు:- నేను ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకున్నారాా కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే తట్టుకోలేవురా నాన్నా ! అని చేప్పింది.కన్న తల్లి తండ్రులను వృధాశ్రమములో చేర్పించె కొడుకులకు అంకితం నచ్చితే నలుగురికి పంపించండి.కొందరైనా మారుతారు అని నమ్మకంతో
💐 ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు. 💐 ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. 💐 ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్’’ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 💐 ఈ సంఘటన జరిగిన మూడు రోజుల త...
*ఒక అద్భుతమైన కథ*. రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కా...