ఒక పెద్ద ఓడ చెడిపోయింది..
కదలనని మొరాయిస్తోంది..
చాలామంది నిపుణులు వచ్చి చూశారు.
కానీ లాభం లేకపోయింది.
ఎవరూ బాగు చేయలేకపోయారు. ఓడ కదలనంటోంది.
ఊరంతా గాలించి 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజినీర్ను వెతికి పట్టుకుని రిపేర్ బాధ్యత అప్పగించారు.
అతను ఓడను పై నుంచి కింది వరకు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు.
అంతా చూశాక ఇంజినీర్ తన బ్యాగ్ తెరిచి చిన్న సుత్తిని బయటకు తీశాడు.
ఇంజిన్ దగ్గరలో ఒక భాగం మీద మెల్లగా కొట్టాడు. వెంటనే, ఇంజిన్ మళ్లీ ప్రాణం పోసుకుంది. సమస్య పరిష్కారమైంది!
ఒక వారం తర్వాత ఇంజనీర్ ఓడ యజమానికి ఆ జెయింట్ షిప్ రిపేర్ చేయడానికి మొత్తం 20,000 డాలర్ల బిల్లు పంపాడు.
ఓడ యజమాని ఆశ్చర్యపోయాడు..
"మీరు చేసింది ఏమీ లేనేలేదు. మహా అయితే అరగంట మాత్రం పనిచేశారు మా కోసం. సుత్తితో చిన్నగా కొడితేనే ఇంజిన్ ప్రాణం పోసుకుంది.. దానికే అంత బిల్లు ఏమిటి? మాకు వివరణ కావాలి.. దేనికి ఎంత ఖర్చో తెలియాలి" అన్నాడు.
ఇంజనీర్ అతనికి సమాధానం పంపాడు:
"సుత్తితో కొట్టడానికి: $ 2
ఎక్కడ కొట్టాలో, ఎంతమేరకు కొట్టాలో తెలుసుకోడానికి: $ 19,998’’
ఒకరి నైపుణ్యం, అనుభవానికి ఇవ్వాల్సిన విలువ అది...
ఎందుకంటే ఎంతో ప్రయత్నం, మరెంతో పట్టుదల, కృషి ఫలితంగానే అనుభవం వస్తుంది.
నేను మీ పనిని 30 నిమిషాల్లో పూర్తి చేసిన మాట వాస్తవమే. కానీ 30 నిమిషాల్లో ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోడానికి నేను 20 సంవత్సరాల పాటు కష్టపడ్డాను.
మీరు నాకు అన్ని సంవత్సరాల అనుభవానికి డబ్బులు ఇవ్వాలే తప్ప, నేను పనిచేసిన 30 నిమిషాలకు కాదు.
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...