పారాయణం చేయడంలో ఇతర గ్రంధాలకు ,
భాగవతానికి తేడా ఉంది .దీన్ని పఠించడం వల్ల
ఐహిక (ఈలోకం )ఆముష్మిక (పరలోకం ) ప్రయోజనాలు నెరవేరతాయి .ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది .నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా
మారినా ,పైకి మామూలుగానే కనిపిస్తుంది .
పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది .
ఆలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి ,
మనిషి పైకి మమూలుగా ఉన్నా అంతరాంతరాల్లో
అధ్యాత్మిక పరిణితి కలిగినవాడవుతాడు .
ఏవైనా విఘ్నాలు ,ఏర్పడితే గజేంద్ర మోక్షం ,
రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తారు .అవి పూర్తయ్యేసరికీ వారిలో ధైర్యం ,ఆత్మస్థైర్యం
పెంపొందుతాయి .అవరోధాల్ని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు లోకజ్ఞానం అలవడుతుంది
అంబరీష ,ధ్రువ ఉపాఖ్యానాలు ,ప్రహ్లాద చరిత్ర వంటి అనేక ఘట్టాల్ని పలు కోరికలతో పారాయణ
చేస్తారు .ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు .ఏ ప్రయోజనమూ ఆశించకుండా భాగవతాన్ని ఏడు
రోజులల్లో పారాయణ చేయాలన్న నియమమం
ఉంది .దీన్ని " భాగవత సప్తాహం "అని పిలుస్తారు
పరీక్షిత్తులోని మృత్యుభయం ,ఆందోళన పోగొట్టడానికి శుక మహార్షి భాగవత కథల్ని వారం
రోజుల్లో చెప్పి పూర్తిచేస్తాడు .అది విన్న పరీక్షిత్తు
మృత్యువును జయించిన అనుభూతి పొందుతాడు .భయం తొలగి ప్రశాంతచిత్తుడవుతాడు .ఆ కథల్లో మాయామోహాలు నశింపచేసే అంశాలు ఉండటమే అందుకు కారణం .అప్పటినుంచే
భాగవతాన్ని చదవటం ఏడు రోజులలో పూర్తిచేయాలన్న నియమము వచ్చిందంటారు .
సప్తాహం అని పదానికి కొందరు మరొక అర్ధమూ
చెబుతారు .అదివారం మొదలు శనివారం
వరకు వారానికి ఏడు రోజులు .అన్ని రోజులూ
ఏనాడూ ఆగకుండా జీవితాంతం నిత్య పారాయణ చేస్తునే ఉండాలంటారు .మాయా మోహాలు ఐహిక వాంఛలు నశిస్తాయన్నదే
అందులోని ఆంతర్యం .
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...