దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి.వారికి సకల సంపదలు ఉన్నా కానీ, సంతానం మాత్రం లేకపోవడంతో వశిష్ట మహర్షి వద్దకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు.
ఆయన తన వద్ద ఉన్న నందిని అనే ధేనువును ఆరాజదంపతులకిచ్చి "దీనిని నిష్ఠగా సేవించండి. తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది" అని చెప్పాడు.
ఆ దంపతులు ఆ ఆవుని తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సేవించుకో సాగారు.
ప్రతిరోజు రాజే స్వయంగా అడవికి తీసుకెళ్లి.అది మేత మేసిన తర్వాత తీసుకొచ్చేవాడు.
ఓ రోజున రాజు ఏమరపాటున ఉన్నప్పుడు ఆ ఆవు కాస్తా తప్పిపోయింది. రాజు దానికోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహనుంచి అంబారావాలు వినిపించాయి.
వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు. అక్కడ ఆ అవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది.
దిలీపుడు వెంటనే బాణం సంధించబోయాడు.
చిత్రం!
ఆయన చెయ్యి స్తంభించిపోయినట్లయింది.
ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయిన రాజుతో ఆసింహం మానవభాషలో
*"రాజా!*
నేను శివుడికి అత్యంత ఆప్తుడనైన కుంభోధరుడనేవాడను. శివుడు నందిని అధిరోహించేముందు నా పైన కాలు పెట్టి ఎక్కుతాడు.
ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను భక్షించడం నా హక్కు.ఇప్పుడు ఈ అవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను,
అడ్డులే" అంటూ తొందర చేసాడు కుంభోదరుడు.
"మా గురువు వశిష్ఠుడు దీని భాధ్యతను నాకు అప్పగించారు.
నా సంరక్షణలో ఉన్న ఈ ఆవుని విడిచిపెట్టు లేదా, నేనే దాని బదులుగా నీకు ఆహారమవుతా" అన్నాడు దిలీపుడు.
"పిచ్చివాడా! ఆవుకోసం ప్రాణాలెవరైనా వదులుకుంటారా! నీవు రాజువు. నీ ప్రాణాలు ఉంటే ఇటువంటి వెయ్యి ఆవులను దానంగా ఇవ్వవచ్చు" అంది సింహం.
"ఆవునే కాపడలేనివాడిని నేనింక ప్రజల ప్రాణాలనేమి కాపాడగలను?అందుకే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో" అంటూ ప్రాధేయపడటంతో అంగీకరించింది సింహం. కళ్ళు మూసుకున్నాడు రాజు.
అయితే, సింహం తన మీద పడకపోగా పైనుంచి పూలవర్షం కురవడంతో పాటు,
" కుమారా!లే" అన్న పలుకులు వినపడటంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు రాజు.
"రాజా! నీ ధర్మతత్పరతకు మెచ్చాను. నా పాలు పిండి,నీవు, నీ భార్యా ఇద్దరూ తాగండి.సత్సంతానం ప్రాప్తిస్తుంది"అని చెప్పింది నందిని.
దిలీప మహారాజు ఆ ఆవుపాలు పితికి తాను తాగి భార్యకు కూడా తాగించాడు.
రాణి గర్భం ధరించి,పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డే రఘుమహారాజు.రాముడి తాతగారు. ఆయన పేరు మీదుగానే రఘువంశం ఏర్పడింది.రాముడు ఆయన నుంచే ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు.రఘురాముడయ్యాడు.
🕉️🌞🌎🏵️🌼🚩
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...