దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి.వారికి సకల సంపదలు ఉన్నా కానీ, సంతానం మాత్రం లేకపోవడంతో వశిష్ట మహర్షి వద్దకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు.
ఆయన తన వద్ద ఉన్న నందిని అనే ధేనువును ఆరాజదంపతులకిచ్చి "దీనిని నిష్ఠగా సేవించండి. తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది" అని చెప్పాడు.
ఆ దంపతులు ఆ ఆవుని తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సేవించుకో సాగారు.
ప్రతిరోజు రాజే స్వయంగా అడవికి తీసుకెళ్లి.అది మేత మేసిన తర్వాత తీసుకొచ్చేవాడు.
ఓ రోజున రాజు ఏమరపాటున ఉన్నప్పుడు ఆ ఆవు కాస్తా తప్పిపోయింది. రాజు దానికోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహనుంచి అంబారావాలు వినిపించాయి.
వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు. అక్కడ ఆ అవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది.
దిలీపుడు వెంటనే బాణం సంధించబోయాడు.
చిత్రం!
ఆయన చెయ్యి స్తంభించిపోయినట్లయింది.
ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయిన రాజుతో ఆసింహం మానవభాషలో
*"రాజా!*
నేను శివుడికి అత్యంత ఆప్తుడనైన కుంభోధరుడనేవాడను. శివుడు నందిని అధిరోహించేముందు నా పైన కాలు పెట్టి ఎక్కుతాడు.
ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను భక్షించడం నా హక్కు.ఇప్పుడు ఈ అవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను,
అడ్డులే" అంటూ తొందర చేసాడు కుంభోదరుడు.
"మా గురువు వశిష్ఠుడు దీని భాధ్యతను నాకు అప్పగించారు.
నా సంరక్షణలో ఉన్న ఈ ఆవుని విడిచిపెట్టు లేదా, నేనే దాని బదులుగా నీకు ఆహారమవుతా" అన్నాడు దిలీపుడు.
"పిచ్చివాడా! ఆవుకోసం ప్రాణాలెవరైనా వదులుకుంటారా! నీవు రాజువు. నీ ప్రాణాలు ఉంటే ఇటువంటి వెయ్యి ఆవులను దానంగా ఇవ్వవచ్చు" అంది సింహం.
"ఆవునే కాపడలేనివాడిని నేనింక ప్రజల ప్రాణాలనేమి కాపాడగలను?అందుకే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో" అంటూ ప్రాధేయపడటంతో అంగీకరించింది సింహం. కళ్ళు మూసుకున్నాడు రాజు.
అయితే, సింహం తన మీద పడకపోగా పైనుంచి పూలవర్షం కురవడంతో పాటు,
" కుమారా!లే" అన్న పలుకులు వినపడటంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు రాజు.
"రాజా! నీ ధర్మతత్పరతకు మెచ్చాను. నా పాలు పిండి,నీవు, నీ భార్యా ఇద్దరూ తాగండి.సత్సంతానం ప్రాప్తిస్తుంది"అని చెప్పింది నందిని.
దిలీప మహారాజు ఆ ఆవుపాలు పితికి తాను తాగి భార్యకు కూడా తాగించాడు.
రాణి గర్భం ధరించి,పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డే రఘుమహారాజు.రాముడి తాతగారు. ఆయన పేరు మీదుగానే రఘువంశం ఏర్పడింది.రాముడు ఆయన నుంచే ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు.రఘురాముడయ్యాడు.
🕉️🌞🌎🏵️🌼🚩
💐 ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు. 💐 ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. 💐 ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్’’ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 💐 ఈ సంఘటన జరిగిన మూడు రోజుల త...
*ఒక అద్భుతమైన కథ*. రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కా...